మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయమని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ దారా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లోని తెలంగాణ దిమ్మె వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంపుకు హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలకు ప్రజల్లో ఆదరణ కరువై ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తప్ప, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పూసం వెంకటేశ్వర్లు, బానోత్ కుమారి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ , గుగులోత్ రమేష్, చండ్రుగొండ టౌన్ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావు, చాపలమడుగు రామరాజు, చలవాది రామారావు, వంకాయలపాటి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: