మన్యం టీవీ, దుమ్ముగూడెం ::
ముఖ్యమంత్రి ప్రకటించిన 1000కోట్ల నిధుల నుంచి తక్షణమే దుమ్ముగూడెం మండలానికి కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలోని వరద ముంపు గురైనటువంటి సున్నం బట్టి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం, సీతారామ ఎత్తిపోత పథకం సీతమ్మసాగర్ వంటి నిర్మాణం వలన గతంలో కంటే వేగంగా వరదలు పరివాహ గ్రామాలు సున్నం బట్టి ఎం కాశినారం పర్ణశాల ఎల్లంరావుపేట కన్నాపురం గంగోలు రేగుబల్లి తూరుబాక ప్రాంతాలు ముంపుకి గురవుతున్నాయని అందువలన భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించిన 1000 కోట్ల రూపాయల ప్యాకేజీని తక్షణమే మండలానికి నిధులు మంజూరు చేసి లోతట్టు ప్రాంతాల చుట్టూ కరకట్ట అలానే నిర్వహితులకు ఎత్తైన ప్రదేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు అలానే వరదల సమయంలో జిల్లా మంత్రి కలెక్టర్ మండలంలో పర్యటించి ఇక్కడ పరిస్థితిని గమనించి బాధ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కావున వెంటనే వారు స్పందించి మండల ప్రజానీకానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నలగోర్ల ప్రభాకర్ బంటు మంగరాజు కొండ కృష్ణ మర్లపాటి పాపారావు పసుపులేటి సుబ్బారావు సందీప్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: