మన్యం మనుగడ , కరకగూడెం:
ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతరావు ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100 శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిని చేసిన ఎంపీపీ రేగా కాళికా.ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ 2022-2023 సంవత్సరానికి గాను సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 35-40 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లలను వంద శాతం రాయితీపై మత్స్య సహకార సంఘాలకు మరియు గ్రామ పంచాయతీ చెరువులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవలని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మనక మండలానికి 37వేలు చేప పిల్లలు ఇవ్వడం జరిగింది అని తెలియజేసారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పరచడానికి ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: