మన్యం టివి , మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.1 కోటి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నిధులతో ఎస్సీ,మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు మణుగూరులో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.పినపాక నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,ప్రతి అణువుపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని,ప్రాధాన్యత క్రమంలో హామీలు అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా విప్ రేగా తెలిపారు.
Post A Comment: