CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నర్సాపురం సర్పంచ్ శివరామకృష్ణ పై దాడి..

Share it:



  • నర్సాపురం సర్పంచ్ శివరామకృష్ణ పై దాడి.. 
  • భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో రౌడీలతో దాడి చేయించిన సిపిఐ నాయకులు.. 
  • సర్పంచ్ పై దాడిని తీవ్రంగా ఖండించిన తెలంగాణ ఆదివాసి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రామ్మూర్తి.. 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

రోజు రోజుకి పంచాయతీలో తన ఆదరణ పెరుగుతుందని ఎలాగైనా వారి ఉనికి కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆదివాసి సర్పంచ్ శివరామకృష్ణ పై సిపిఐ నాయకులు హత్యాయత్యానికి పాల్పడిన సంఘటన భద్రాచలం అంబేద్కర్లో శనివారం రాత్రి జరిగింది. దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ శివరామకృష్ణ పంచాయతీలోని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ప్రజల చేత మన్ననులు పొందుతూ నిత్యం ప్రజా సేవకై పని చేస్తూ ప్రజలందరి పేరు ప్రతిష్టలు పొందుతున్నాడు ఈ తరుణంలోనే అక్కడ సిపిఐ నాయకుడైన రావులపల్లి రవికుమార్ (ఉపసర్పంచ్) ఆ ఏరియాలో పట్టుకొల్పుతుననే ఉద్దేశంతో అలానే సర్పంచ్ తోకూడా  విభేదాలు ఉన్నాయ్. దీని ఆసరాగా తీసుకొని నిన్న రాత్రి కొంతమంది గుండాలతో దాడి చేయించారు ఈ సంఘటనపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తన ఉనికి చాటాలనే ఉద్దేశంతో ఆదివాసి సర్పంచ్ పై దాడి చేయించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆదివాసి సర్పంచులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రామ్మూర్తి తెలిపారు.అలానే దాడి చేపించిన సిపిఐ నాయకులు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసి సర్పంచుల తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల ఆదివాసి సర్పంచులు పాల్గొన్నారు..

Share it:

Post A Comment: