ములకలపల్లి:(ఆగష్టు29)మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని,ఉత్సవాలు నిర్వహించ దలచినవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఆ కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలని, గ్రామ పంచాయతీ వారి అనుమతితప్పని సరిగా తీసుకోవాలి. సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళు అట్టి స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి తప్పనిసరిగా పొందవలెను.విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని,గ్రామాలలో వివిధ కూడళ్లు వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీసువారికి తప్పనిసరిగా తెలియజేయాలి.సౌండ్ & మైకులను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసువారి అనుమతులు తప్పనిసరని. DJ సౌండ్ లకు,బూర మైకు లకు గణేష్ మండపాల వద్ద ఏర్పాటుకు అనుమతి లేదని,కేవలం రెండు సౌండ్ బాక్స్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని,గణేష్ మండపాల ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లు బ్లాక్ కావడం, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాల వద్ద తగు జాగ్రత్తలు చేసుకోవాలని పోలీస్ వారు తెలిపారు.
Post A Comment: