మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటీవలే వచ్చిన భారీ వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అల్లకల్లోలం చేసిన గోదావరి మళ్లీ 50 అడుగుల దాటి ప్రవహిస్తుండటంతో పరివాహ ప్రాంతాలైన సున్నం బట్టి ఎం కాశినారం పర్ణశాల దుమ్ముగూడెం రేగుబల్లి తూరుబాక గ్రామాల ప్రజలకు ఆందోళన మొదలైంది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలకు మండల అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలుగా సూచనలు అందించారు అలానే తూరుబాక గ్రామం వద్ద ఆర్ అండ్ బి రోడ్డు మీద వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఆర్టీసీ అధికారులు చర్ల వైపు వెళ్లే బస్సులను రద్దు చేశారు అలానే ముఖ్యంగా గోదావరి పెరగడంతో సున్నం బట్టి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి పడవల సహాయంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో పుష్కరఘాట్ వద్ద గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ నార చీరలు ప్రదేశాన్ని పూర్తిగా నీటి మునిగాయి. సిడబ్ల్యుసి అధికారులు తెలిపిన ప్రకారం దుమ్ముగూడెం హెడ్ లాక్స్ వద్ద 26 అడుగుల నీటిమట్టం చేరిందని తెలియజేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా వాగులు వంకలు చేపల వేటకు వెళ్లొద్దని పశువులను ఇంటిపట్టునే ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Post A Comment: