CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెరుగుతున్న గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.సున్నం బట్టి గ్రామస్తులను పునరావసు కేంద్రాలకు తరలింపు...

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

గోదావరి ఎగువ నుండి వస్తున్న వరదకు క్రమ క్రమంగా పెరుగుతునడంతో దుమ్ముగూడెం మండలంలోని ముంపు ప్రాంతమైన సున్నం బట్టి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు పునరావస కేంద్రం మంగువాయి బడువ ఆశ్రమ పాఠశాలకు తరలిస్తున్నారు. గోదావరి 55 అడుగులు వరకు వస్తుందని అంచనా మేరకు ముందు జాగ్రత్త చేయగా లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తుంటే అధికారులు తెలిపారు మొన్నటికి మొన్న వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న సున్నంబట్టి గ్రామస్తులు మళ్లీ గోదారి వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా కొందరు మహిళలు గోదావరి వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని తరలించే దానికంటే మాకు శాశ్వత పరిష్కారం దిశగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎత్తైన ప్రదేశంలో నిర్మిసిస్తే ఈ గోదావరి ముంపు నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు ఈ కార్యక్రమం కి దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్ వారి సిబ్బంది దగ్గరుండి గ్రామస్తులను ఖాళీ చేపించారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దారు చంద్రశేఖర్ ఎంపీడీవో చంద్రమౌళి ఆర్ఐలు ఆదినారాయణ లక్ష్మయ్య మండల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: