సర్వసభ్య సమావేశానికి ప్రతిసారి అధికారుల డుమ్మా
ఆర్ అండ్ బి నిధుల దుర్వినియోగంపై మండిపడ్డ ప్రజా ప్రతినిధులు : అధికారుల తీరు మార్చుకోవాలి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
గుండాల/ ఆళ్ళపల్లి ఆగస్ట్ 29(మన్యం మనుగడ) సర్వసభ్య సమావేశానికి ప్రతిసారి అధికారుల డుమ్మా కొట్టడంపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పనులపై సమీక్షలు వారి వివరణలు చెప్పాల్సిన అధికారులు ప్రతిసారి డుమ్మా కొట్టడం ఏమిటని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆర్ అండ్ బిధుల దుర్వినియోగంపై ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు.
ఇప్పటి వరకు మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని ఆయా శాఖల అధికారులపై జిల్లా అధికారులకు తెలియజేసి తగుచర్యలు తీసుకునే విధంగా చేస్తామని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు..ఈ సమావేశానికి మండలంలోని 22 శాఖలకు గాను 12 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇరిగేషన్, విద్యా, వైద్యం, ఈజీఎస్, ఐకేపీ, సెర్ఫ్, వెటర్నరీ, ఐసీడీఎస్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖ అధికారులు మాత్రమే హాజరుకాగా మిగతా 10 శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి జెడ్పీటీ హనుమంతరావు, ఎంపీడీవో మంగమ్మ, తహసీల్దార్ మొహమ్మద్ సాదియా సుల్తానా, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, ఎంపీటీసీ సత్యవతి, కో ఆప్షన్ సభ్యుడు రహీం, ఇరిగేషన్ అధికారి దుర్గ ప్రసాద్, విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య, వైద్యాధికారి సుధీర్, ఈజీఎస్ ఏపిఎం రఘునాథ్, వెటర్నరీ రమేష్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి అరుణకుమారి, ఆర్ డబ్ల్యూఎస్ కిషోర్, ఆర్ అండ్ బి ప్రశాంత్, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: