మన్యం మనుగడ కరకగూడెం:గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారి అదేశానుసారంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం(చిరుమళ్ళ) లో ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం రెండు బృందాల ద్వారా రాష్ట్రీయ బాల స్వస్తి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరుగురు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆర్.డి.పి పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డా,,గోపిలాల్,డా,,నరహరి, డా,,ఉమాదేవి, డా,,గౌతమి పుత్రి వీరితో పాటు కరకగూడెం వైద్య అధికారి డా,,పర్షియా నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: