CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులోపుడి మృతి చెందిన వ్యక్తి..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

మండలంలోని పర్ణశాల గ్రామపంచాయతీ పరిధి పిరాయిగూడెం గ్రామానికి చెందిన బుటారి శీను వయసు 29 ఈరోజు మధ్యాహ్నం పర్ణశాల క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి సీత వాగు దగ్గర చేపల వేటకు ముగ్గురు వ్యక్తులు కలిసి వెళ్లారు. చేపల వలలు వాగులు వేసి సాయంత్రం 5.30 ప్రాంతంలో చేపల వలలు తీయడానికి వెళ్లిన శ్రీను  ప్రమాదవశాత్తు శ్రీను గోదావరి వరద ప్రవాహం ఎక్కువ రావడంతో వాగులో పడి మృతి చెందాడు. గోదావరి వరద గంటకు పెరుగుతూ ఉండటంతో అంచనా వేయలేకపోయినా తను   చేపల వల కాలికి చిక్కుకోవడంతో మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు భార్య నాగులమ్మ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గోదావరి వరదల గురించి వాగులు వంకలకు చేపల వేటకు వెళ్ళొద్దని పదేపదే చెప్పిన ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు అని స్థానిక సర్పంచ్ తెల్లం వరలక్ష్మి తెలిపారు.

Share it:

TS

Post A Comment: