CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి గూడెంలో తల్లిపాల వారోత్సవాలు.ముర్రుపాల ప్రాముఖ్యతను వివరించిన అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయితీలోని ఆదివాసి గ్రామం టేకులగూడెం లో అంగన్వాడీ కార్యకర్త కలం చంద్రకళ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ ఆదివాసి ముర్రుపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.బిడ్డకు జన్మనిచిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలి అని, ఈ యొక్క ముర్రుపాలుతోనే పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని తెలియజేశారు. తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా, ఆరోగ్యంగా, తెలివితేటలతో  పెరుగుతారు. కాబట్టి తప్పనిసరిగా  పిల్లలకు ముర్రుపాలు పట్టించాలి అంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేటటువంటి ఫోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే బిడ్డకు సరిపోయే అన్ని ఫోషకాలతో కూడిన పాలు తల్లి అందించగలదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  గర్భిణీ స్త్రీలు, బాలింతలు,పిల్లలు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: