CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జెండా కార్యక్రమం చేపట్టిన అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు దేశం నాలువైపులకు చేరాలని అన్నారు.మనం దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే. దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోరాటయోధులను ఎన్నటికీ మరిచిపోలేం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, ఐక్యంగా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవం గొప్ప పండుగ. ఎందరో మహానుభావులు, సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన ‘స్వాతంత్ర్యం’ ఇది. తెల్లదొరల తలలు వంచి సాధించిన స్వాతంత్ర్యం .మువ్వన్నెల రెపరెపల్లో కులమతాలకు అతీతంగా పండుగలా సాగే పంద్రాగస్టు రోజు ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగే రోజు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,అశ్వాపురం ఉప సర్పంచ్ భూక్యా చందులాల్, సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,ఈదర సత్యనారాయణ,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,చంచ్చు రామ్మూర్తి,చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లాంకెలా రమేష్, మండల పార్టీ ప్రచార కార్యదర్శి రామకృష్ణ,మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత,మండల మహిళా ఆర్గనైజింగ్ అధ్యక్షురాలు రావుల రాధమ్మ,బీసీ,ఏస్సీ,ఎస్టీ మైనారిటీ అధ్యక్షులు మామిళ్ల కనీష్,కోర్స దుర్గ రావు, ఎస్.కె నాయుమ్, మండల యువజన ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు ,మండల ప్రచారా కార్యదర్శి జూపెల్లి కిరణ్,మండల నాయకులు ,నక్కనాబోయిన పాపారావు,మొగిళ్ల వీరారెడ్డి,పెద్దిరెడ్డి,తోకల దుర్గారావు,యువజన నాయకులు నజీర్ సోను,రావుల అజయ్,వంశీ,డేవిడ్,సంపత్,శంకర్,హరీష్,శేఖర్,మండల సోషల్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్ ,గజ్జి లోహిత్, కార్యకర్తలు, తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: