CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్...

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండల గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మండల పర్యటనలో భాగంగా గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసి అనంతరం సున్నం పట్టి గ్రామంలో వరద బాధితులకు పరామర్శించి తదుపరి కార్యక్రమంలో భాగంగా ఆయన లక్ష్మినగరం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఉండగా ఆయన వాహనాన్ని అనుసరించాల్సిన పోలీస్ రెవెన్యూ సిబ్బంది నేరుగా ఆశ్రమ పాఠశాల చేరుకోగా కమిషనర్ ప్రయాణిస్తున్న వాహనం దుమ్ముగూడెం గ్రామంలోకి వెళ్ళింది అయితే లక్ష్మి నగరం ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న అధికారులు కమిషనర్ ప్రయాణించే వాహనం ఎంతకీ రాకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోగా కమిషనర్ వాహనం దుమ్ముగూడెం గ్రామాలకు వెళ్లిందని తెలిసింది దీంతో అధికారులు హడావుడిగా దుమ్ముగూడెం చేరుకున్నారు అనంతరం కమిషనర్ వాహనంతో సహా అధికారులు లక్ష్మి నగరం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ హైస్కూల్ కు చేరుకోగా రూట్ మ్యాప్ స్పష్టంగా తెలియపరచిన అవసరం అధికారులు లేదా అని రాష్ట్ర ఉన్నత స్థాయి కమిషనర్ మండల కి వస్తే పోలీస్ రెవెన్యూ అధికారులు ప్రోటో కాల్ పాటించడం లేదని స్థానిక ఎస్సై, తాసిల్దార్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకానొక దశలో తను ఒంటరిగానే వెళ్ళిపోతానని కమిషనర్ తన కారు ఎక్కి కూర్చున్నారు దీంతో కంగారు పడిన అధికారులు తాసిల్దార్ చంద్రశేఖర్ ఆయన బ్రతిమాలి, నచ్చజెప్పి ఇలాంటి పొరపాటు మరోసారి రాబోదని ఆయన్ని ఆశ్రమ పాఠశాలకు తీసుకుని వెళ్లారు అలానే ఆయన పర్యటనలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో అసహనం వ్యక్తం చేశారు.

Share it:

TS

Post A Comment: