మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం పంచాయతీలోని చింతల బయ్యారం గ్రామానికి ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ వినాయక విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం చింతల బయ్యారం గ్రామంలో గల శివాలయ దర్శనానికి వెళ్లిన సిఐ రాజగోపాల్, ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి, గ్రామస్తులతో మాట్లాడుతూ, వినాయక చవితికి విగ్రహాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా పదివేల విలువచేసే విగ్రహాన్ని కొనుగోలు చేసి, గ్రామానికి అందించారు. ఈ విషయం పట్ల గ్రామస్తులు తమ సంతోషాన్ని తెలియజేస్తూ, పోలీస్ శాఖకు, సిఐ రాజగోపాల్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: