మన్యం మనుగడ, మంగపేట.
సారపాక నుండి హన్మకొండ వైపు వెళ్తున్న జామాయిల్ కర్రల లోడు మంగపేట మండలం చుంచుపల్లి మూల మలుపు దగ్గర అదుపు పడిపోయింది, రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న పిల్లపై ప్రమాద వశాత్తు కర్రల లోడు పడిపోవడం, ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయి కర్రల క్రింద ఉన్న ముగ్గురిని రక్షించడం జరిగింది. కర్రల లోడు క్రింద పడిన ముగ్గురు కూడా మృత్యువును జయించారు. లారీ ప్రమాదం నుండి బయట పడిన పిల్లలు కొమరం గోపి చంద్ 18 సం, కల్తీ దిలీప్ 17సం, పోలెబోయిన సాయి 11సంవత్సరాలు. ఈ ప్రమాదం లో లారీ కేబిన్ క్రింద ఇరుక్కుపోయిన పోలెబోయిన సాయి కాలుకు తీవ్ర గాయాలు అవగా, మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డారు. ఎట్టకేలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవడం తో ముగ్గురు మృత్యుంజయులే అని ప్రజలు తెలియజేశారు.
Post A Comment: