మన్యం మనుగడ కరకగూడెం:
మండలంలోని చొప్పల- గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ రంగాపురం గ్రామంలో ఆధార్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో సంస్థ వ్యవస్థపాకులు తొలెం.రమేష్ సహయంతో మన్యం మనుగడ రిపోర్టర్ బట్టా.బిక్షపతి అధ్వర్యంలో స్థానిక సర్పంచ్ జవ్వాజి రాధ చేతులమీదుగా 40 కుటుంబాలకు దోమ తెరలు పంపిణీ చెయ్యడం జరిగింది. సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత పాటించాలని, ఇంటికి ఇరువైపులా పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని, మురికి గుంటలు లేకుండా పరిశుభ్రత పాటించాలని, సీజనాలు వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అన్నారు. గ్రామంలో దోమ కాటుకు గురికాకుండా అందరూ దోమతెరలు వాడాలని సూచించారు. పంచాయతీలోని 40 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశామని ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడమే తమ యొక్క ముఖ్య ఉద్దేశం అని బట్టా భిక్షపతి అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు ఎట్టి .నర్సయ్య, జవ్వాజి .సమ్మయ్య,బొమ్మయ్య,క్రిష్ణ,భను శంకర్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: