గుండాల ఆగస్టు 15(మన్యం మనుగడ) మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తాసిల్దార్ నాగదివ్య ఆవిష్కరించగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం, ఎంఈఓ కార్యాలయంలో కృష్ణయ్య, గుండాల పంచాయతీలో సర్పంచ్ సీతారాములు,జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నవీన జ్యోతి, జిల్లా పరిషత్ ఉన్నత కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులు కిషన్, రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ హరికృష్ణ జాతీయ జెండాను ఎగరవేశారు. వీరితోపాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా నిర్వహించారు
Post A Comment: