గుండాల ఆగస్టు 6(మన్యం మనుగడ) మండలం పరిధిలోని సాయనపల్లి గ్రామంలో ఎస్సై కిన్నెర రాజశేఖర్ సైబర్ క్రైమ్ ఫై అవగాహన కల్పించారు. శనివారం గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి అనంతరం ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు వ్యక్తులు చరవాణిలో మీకు సంబంధించిన బ్యాంకు వివరాలను అడిగినట్లయితే అలాంటి వ్యక్తులు సైబర్ నేరగాండ్లు కావచ్చని వారికి మీ మీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన గోప్యతను చెప్పకూడదన్నారు. మీ బ్యాంకు ఖాతా నుండి అపరిచిత వ్యక్తులు మీ డబ్బును తస్కరిస్తే 24 గంటలలోపే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చిన ఎడల మీ డబ్బులు బ్యాంకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు సాయిబారు నేరగాళ్లు వేసే వలలో పడద్దని సూచించారు
Post A Comment: