మన్యం మనుగడ వెంకటాపురం ఆగస్టు 31. : వెంకటాపురం మండలంలో గ్రామ గ్రామాన భక్తి శ్రద్ధలతో వినాయక పండుగను చాలా ఘనంగా జరుపుతారు. వీధుల్లో, ఇళ్ళల్లో వినాయకుడి బొమ్మను మట్టితో చేయించి పెడుతారు.వినాయకుడిని దాదాపు 11 రోజులు ప్రతిష్టించి పూజలు చేస్తారు. వినాయకుడికి రక రకాల నైవేద్యాన్ని పెడుతారు. వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. 11వ రోజు లడ్డు వేలం వేస్తారు. విగ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టిన లడ్డు వేలంలో గెలిచిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. గణేషుడి ఉత్సవాలు 10 రోజులు జరగనున్నాయి. అయితే 11 వ రోజున నిమజ్జనం చేస్తారు. ప్రతి ఏడాది ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Navigation
Post A Comment: