మన్యం టీవీ దుమ్ముగూడెం ::
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాక్టో కో చైర్మన్( ఏటిఏ అధ్యక్షులు) కల్లూరు జయ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ దుమ్ముగూడెం మండల ప్రధాన కార్యదర్శి పూనెం రమేష్ ఆధ్వర్యంలో మహాదేవపురం పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ నిరసనమ కార్యక్రమంలో నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఒకటో తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన నిరసన ధర్నా కార్యక్రమం పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్ర కార్యక్రమం నిర్వహించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ విధానాన్ని రద్దు పరచాలని కోరుతూ అనేక నిరసన కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏటిఏ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు వసంతరావు నరేష్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: