మన్యం మనగడ, డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం తెలంగాణలోని వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిశీలనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ ఆధ్వర్యంలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ మాట్లాడుతూ, తెలంగాణలోని దాదాపు అన్ని మార్కెట్ కమిటీలు ఒకదానితో ఒకటి ఆదర్శంగా ఉన్నాయని, ఈ పర్యటనలో చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నామని,అదే మార్గంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి పరిచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని, తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయని,పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగాకాంతారావు సహకారంతో,బూర్గంపాడు మార్కెట్ కమిటీని మరింత ముందుకి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ పర్యటనలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, డైరెక్టర్లు బిల్లం సాంబశివరావు, భానోత్ శ్రీను, పోడియం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: