మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి నాయకపోడ్ గూడలలో జెండా ఎగురవేయాలని సేవా సంఘం నిర్ణయం మేరకు మండల వ్యాప్తంగా నాయక పోడులు జెండా దిమ్మలు ఏర్పాటు చేయనున్నట్లు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం అశ్వరావుపేట మండల అధ్యక్షుడు నారం సీతారాం సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అశ్వరావుపేట మండలంలో జమ్మిగూడెం, నారవారిగూడెం, మల్లాయిగూడెం, పాపిడి గూడెం, అచ్యుతాపురం, దిబ్బగూడెం, నారావారిగూడెం కాలనీ, నల్ల బాడు, వేదాంత పురం, పాత గంగరాం, కొత్త గంగారాం, వాగొడ్డుగూడెం, నారాయణపురం, పాకల గూడెం, మావుళ్ళవారిగూడెం, కాశప్పగూడెం, బీమినిగూడెం, కొత్త నారవారిగూడెం మొదలైన గూడాలలో మరియు మండల కేంద్రంలో జెండాలు ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి ఆంధ్ర లో చింతలపూడి మండలం ఎర్రగుంటలో ఆదివాసీ నాయకులు కొమరం భీమ్, మద్ది రామచందర్ విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Post A Comment: