మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించడం జరిగింది. స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాహెర్ బాబా చేతుల మీదుగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా ఎస్ ఐ తాహెర్ బాబా దేశం కోసం ప్రాణాలు అర్పించిన
స్వాతంత్ర్య సమరయోధుల దివ్య స్మృతి కి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ దేశం కోసం నాటి త్యాగ ధనుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు త్యాగాలు అవసరం లేదు బలి దానాలు అంతకన్నా అవసరం లేదు,మనం మన రంగాలలో పని చేస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల లోను, పారిశ్రామిక రంగం లోను, విద్యా వైద్యం రంగాల లోనూ,దేశ పరి రక్షణ లోను,మన దేశం ఖ్యాతిని ప్రపంచం లోని నలుదిశలకు విస్తరింప చేయాలి, తద్వారా భరత మాత ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయండి, అంతే కాదు మన పిల్లలకు చిన్నప్పటి నుండి దేశభక్తి అంటే ఏమిటో తెలియ జేయండి, ఎల్లప్పుడూ పిల్లలకు నువ్వు ఇంజనీర్, కావాలి,డాక్టర్ కావాలంటూ హిత బోధ చేయకండి వాళ్లకు నచ్చిన రంగం ఎంచుకోవడం కోసం వారికి స్వేచ్ఛ ను ఇవ్వండి, అందరూ ఇంజనీర్లు, డాక్టర్స్ అయితే దేశం యొక్క భద్రత ఎవరు చూడాలి, దేశ భావి భారత పౌరులను ఎవరు తయారు చేయాలి అందుకే వారికి బాల్యం నుండే దేశ భక్తి అంటే ఏమిటో పరిచయం చేయాలి. దేశ భక్తి అంటే తాను ఎంచుకున్న రంగం లో నిస్వార్థం గా పనిచేయడం, సంకుచిత తత్త్వం వదిలి విశాలమైన భావం తో శాంతియుతంగా జీవించడం, ఎవరికైనా ఆపద ఉంటే ఆదుకోవడం, ఎదుటివాడి కన్నీటిని తుడిచి వారికి చేతనైన సహాయం అందించడం లాంటి, భక్తి పూరితమైన భావం తో ప్రజలందరూ మెలగాలి అని ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పోలీస్ స్టేషన్ సిబ్బంది, సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: