ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:మండలంలోని చాపరాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా జరిగాయి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా చాపరాలపల్లి వాస్తవ్యులు సామజిక బాధ్యతగా కోనేరు కోదండ రామారావు,జానకి పేర్లతో కూడిన నోట్ పుస్తకాలు,బిస్కెట్లలను కోనేరు వెంకటశేషగిరి రావు,గిరిజ కుటుంబ సభ్యులు,సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ సత్యనారాయణ, రమణ, ఎంపీటీసీ భద్రం చేతుల మీదుగా మామిళ్ళ గూడెం, చాపరాల పల్లి. కుమ్మరిపాడు, గుట్టగూడెం పాఠశాలకు ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా ఆయా పాఠశాలలో విద్యార్థులకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు రమేష్ రాథోడ్,శ్యామ్,శ్రీలత, రమేష్ లు అందజేసారు,ఈ కార్యక్రమం లో యస్ఎంసి చైర్మన్ కృష్ణ, పెద్దులమ్మ, ఉపాధ్యాయులు సరోజ, చందర్, రాధబాయ్, హతీరం, నిరోషా తదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: