గుండాల ఆగస్టు 7(మన్యం మనుగడ) ఉదృతంగా ప్రవహించే వాగులను దాటి తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఎస్సై కిన్నెర రాజశేఖర్ ప్రజలకు సూచించారు. ఆదివారం గొడవటంచ గ్రామ సమీపంలోని కిన్నెరసాని వాగు దాటుతున్న ప్రజలకు ఆయన గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ఉదృత ప్రవాహం ఉన్నప్పుడు తగ్గే అంతసేపు ఆగి అనంతరం వాగులు దాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కారోబర్ నాగరాజు, ఇబ్బంది అనిల్ పాల్గొన్నారు
Post A Comment: