CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసరా పెన్షన్ల ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Share it:

 


- ఆసరా పెన్షన్ల ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 - కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు. 

- జిల్లాకు 28 వేల నూతన పెన్షన్లు -అశ్వారావుపేట నియోజకవర్గానికి 5994 నూతన ఆసరా పెన్షన్ లు


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, అశ్వారావుపేట ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, దిండిగల్ రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్. ఈ సందర్బంగా ఎంఎల్ఎ మెచ్చా మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నూతన పెన్షన్లు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అశ్వరావుపేట నియోజకవర్గానికి 5994 నూతన ఆసరా పెన్షన్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మెచ్చా వెంట దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు రసూల్, మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్, దొడ్డకుల రాజేశ్వరరావు, దారా బాబు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, భూపతి శ్రీను, మీడా మోహన్ రావు, బిసి సంఘం రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు, సోడెం గంగరాజు, చల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: