మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మల్లాయి గూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ సమక్షంలో శుక్రవారం పంచాయతీ మహిళలు కెసిఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నారం రాజశేఖర్ మాట్లాడుతూ కేటీఆర్ పిలుపుమేరకు రాఖీ పండగ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి అనేకమంది మహిళలతో రాఖీ కట్టించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నా చెల్లెల అపురూప బంధానికి ప్రతీక రక్షాబందమని మండల ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఇక ఇలాంటి సందర్భంలో పండుగ జరుపుకోవడం అభినందనీయమని పెద్ద ఎత్తున అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పలువురు చిన్నారులు రాఖీ కట్టడం జరిగిందని చిన్నారి లందరికీ ఆశీస్సులు అందజేయడం జరిగిందని వారన్నారు. మహిళలకు తెరాస ప్రభుత్వం నుండి అందే పథకముల గురించి మహిళకు తెలియజేశారు . తెరాస ప్రభుత్వం కేసిఆర్, కేటీఆర్ నాయకత్వం లో మహిళలకు అన్ని రంగాలలో అండగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: