మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో స్వాతంత్ర భారత ద్విసప్తాహం కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ నెల 09 నుండీ 120 కోట్ల జాతీయ జెండాలను ప్రతి ఇంటింటికీ జాతీయ జెండా ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం మొదలవుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తామని చెపుతుంటే బీజేపీ ప్రభుత్వం 25 రూపాయలు పెట్టి కొనుక్కోమనటం చాలా దారుణం అనీ, అయినా సంవత్సరం నుండీ జాతీయ జెండాలు మన దేశంలో తయారు చేపించ కుండా ఇతర దేశాలలో కొనటం చాలా హేయమైన చర్య అని బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించు కోవలని ఈ సందర్భంగ అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి మండిపడ్డారు.
Navigation
Post A Comment: