CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐటిడిఎ భద్రాచలం కార్యాలయం ముందు జరిగే ధర్నా జయప్రదం చేయండి.

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం:


దుమ్ముగూడెం మండలంలో బట్టిగూడెం,కొత్తపల్లి,చెరుపల్లి, మారాయిగూడెం,రామచంద్రుని పేట,బోజ్జిగుప్ప,పి నారాయణపేట,ఆర్లగూడెం, కొత్తూరు,గ్రామాలలో సి పి యం పార్టీ అద్వర్యం లో పర్యటన చేయడం జరిగింది జూలై 4వ తేదీన సాగుచేస్తున్న పోడు భూమి సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని జరిగే చలో ఐ టి డి ఎ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య పిలుపునిచ్చారు.గత 2021 సంవత్సరం లో నవంబర్ డిసెంబర్ నెల పోడు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇస్తామని మాయమాటలు చెప్పి దరఖాస్తులు తీసుకొని పోడు సాగు దారులను మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన హెచ్చరిక చేశారు.పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ కూడా వెంటనే ఇవ్వాలని ప్రగళ్ళపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఫారెస్ట్ పోలీస్ నిర్బంధం ఆపాలని పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు.ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పోడు సాగు దారులు జోలికొస్తే ఊరుకునేది లేదని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ,మర్మం చంద్రయ్య, మాజీ సర్పంచ్ రేసు వీరస్వామి,ఉప సర్పంచ్ కొరస చంద్రయ్య,ముర్రం ధర్మయ్య, రాజు,వెంకటేశ్వర్లు,రేసు కాంతమ్మ,రేసు నాగరాజు, కాక రామకృష్ణ, కోనేబోయిన రామారావు,కాక బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: