మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ముంపు గ్రామంలో భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య సందర్శించారు ఈ సందర్భంగా మండలంలోని ఎం కాశిగానారం సున్నం బట్టి బైరగులపాడు ముంపు ప్రాంతంని పరిశీలించి గ్రామస్తులతో వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దని జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడుతానని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వచ్చారని సమాచారంతో కొందరు మహిళలు వారి గోడును చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే వారికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు అనంతరం బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొదెం మధు చంద్ర, అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, పిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్, ఎస్సీ సెల్ చైర్మన్ రవికుమార్, మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సీతారామారావు, నరేష్, అడబాల వెంకటేశ్వరరావు, తోటమల సంగీతరావు, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చించిర్యాల సుధీర్, ప్రదీప్, ఉబ్బ వేణు తెల్లం హరికృష్ణ, పిలక వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: