CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లిన మాజీ ఎంఎల్ఎ తాటి -రేవంత్, సీతక్క లను కలిసి సమస్యల పై చర్చ.

Share it:


 మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఏజెన్సీలో నెలకొన్న పోడు భూమి, ధరణి సమస్యలపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క లను కలసి ఈ ప్రాంత సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పోడు భూముల సమస్య పై ప్రభుత్వం గిరిజనుల ను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును, వారిని వ్యవసాయం చేయనీయకుండా పోలీసు, అటవీ అధికారులతో అడ్డుకోవడాన్ని గుర్తుచేశారు. ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గంలోని రామన్నగూడెం ఎర్రబోడు, కంపగూడెం, గ్రామంలో పోలీసులు చేసిన భీభత్సాన్ని, ఆపై వారిపై పెట్టిన కేసుల గురించిన పరిణామాలపై చర్చించారు. ధరణి మూలంగా ముఖ్యంగా ఏజెన్సీ లో నిలిచిపోయిన అనేక సమస్యలు పై చర్చించారు. ముఖ్యంగా ధరణి మూలంగా ఏజెన్సీలో పివోటీ లు నిలిచిపోయాయని, రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు గతంలో మార్టూగేజ్ పద్ధతి ఉండేదని ప్రస్తుతం ధరణిలో ఈ అవకాశం లేనందున రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని వివరించారు. ధరణి మూలంగా ఇటు గిరిజనులు, గిరిజనేతరులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పర్యటించి ఆ ప్రాంత ప్రజల్లో ఉత్సాహం నింపాలని వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా పోడుభూముల సమస్యకి పరిస్కారం లభిస్తుందని, ధరణి ని పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రజల్లో కి విస్తృతంగా తీసుకువెళ్లాలని తాటికి సూచించారు. ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని, కాంగ్రెస్ అధికారంలో కి వస్తే చేపట్టే కార్యక్రమాలు, వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఆయనతో తాండ్ర బుచ్చిబాబు, సోయం చిన్నారి ఉన్నారు.

Share it:

TS

Post A Comment: