మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సెంటర్ నందు సోమవారం నాడు మణుగూరు పట్టణం టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాసపల్లి.శంకర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మంజూరు ఐన యూనిట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం *దళిత బంధు* పథకం ద్వారా దళితులకు చేయూతనిస్తూ,వారిని అన్ని రంగాలలో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత బంధు పథకం దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు ఐక్యతకు నిదర్శనం గా మారిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణలో మాత్రమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం అవుతున్నాయని,దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా దళితులను బలోపేతం చేసేందుకు ఎటువంటి పూచీకత్తు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా దళితులకు రూ.10 లక్షలను అందించే గొప్ప పథకం *దళిత బంధు* అని అన్నారు.దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్,రూపకల్పన చేసి ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారని విప్ రేగా తెలిపారు.ఇది ఎంతో అద్భుతమైన పథకమని ఇటువంటి పథకం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.ఇంత గొప్పగా విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రతిపక్షాలకు రాద్ధాంతం చేయడం తప్ప, ఇటువంటి హర్షించడం చేతకాదన్నారు.వారు పాలిస్తున్న రాష్ట్రాలలో ఈ విధమైన పథకం ఒకటైన ఉందా అని ప్రతిపక్షాల ను ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలోని ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, మండల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,కో అప్షన్ జావిద్ పాషా,సర్పంచ్ లు,మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు,టిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: