మన్యం మనుగడ వాజేడు జూలై 22:
వాజేడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం,లో భాగంగా గత నాలుగు నెలలుగా చేసిన పనికి వేతనాలు చెల్లించాలని వాజేడు నాగారం ప్రజలు ఆందోళనకు దిగారు. తదనంతరం ఎంపీడీవో విజయ కి సమస్యను విన్నవించారు. ఎర్రటి ఎండలో మా కష్టాన్ని మా కన్నీళ్ళని, కడుపులో నింపుకొని ఎన్నెన్నో ఆశలతో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లామూ నాలుగు నెలలు గడుస్తున్న నేటికీ వేతనాలు రాకపోవడంతో వస్తాయో రాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో విజయ ప్రజలకు వివరణ ఇచ్చారు. స్లిప్పులు వచ్చిన జాబు కార్డ్ హోల్డర్ కి కచ్చితంగా వేతనాలు వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆగిపోయాయని వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలోకి పది, పదిహేను రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు నాగారం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: