దమ్మపేట జులై 24 ( మన్యం మనుగడ ) : తెలంగాణ లో ప్రతిష్టాత్మకం గా జరుపుకునే అషాడమాస బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం గనేష్పాడు శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం లో ఆలయ నిర్మాణ దాతలు మందలపల్లి ఉప సర్పంచ్, దిశ కమిటీ సభ్యుడు గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి తల్లి ఆశీస్సులు పొందారు. గారపాటి అనురాధ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా దీవించమని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.
అనంతరం మందలపల్లి గ్రామం లోని పొలిమేర ముత్యాలమ్మ కు కూడా బోనాలు సమర్పించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో అర్చకులు సింహాద్రి నాగేశ్వరరావు, ఘంటా శశికిరణ్, రాజా గోపి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: