మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరవధిక సమ్మె చేపట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మండలంలోని వీఆర్ఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం వీఆర్ఏ సంఘం అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ వీఆర్ఏల పే స్కేలు అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించాలని, 55 సంవత్సరాల నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పిన హామీ 22 నెలలు గడుస్తున్నా ఇప్పటికి అమలు కాలేదని ఆవేదన చెందారు వీఆర్ఏలు చాలీచాలని వేతనాలతో కొనసాగుతున్నామని మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చి జీవో వచ్చేంతవరకు ఈ నిరవధిక సమ్మె ఇలానే కొనసాగిస్తాంఅని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ మండల కార్యదర్శి రాజేష్, కోశాధికారి నవీన్,సభ్యులు వెంకటలక్ష్మి, శాలిని, లక్ష్మి, మహేష్, ఈశ్వర్, చంటి, వీర్రాజు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: