CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటా:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు టిడబ్ల్యజేఎఫ్ జ్ఞాపిక అందజేత

Share it:


మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభ జ్ఞాపికను శనివారం అందజేశారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడ్యబ్లుజేఎఫ్ నాయకులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావును శాలువాతో సత్కరించి,ఈ నెల 3వ తేదీన భద్రాచలం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభ సందర్భంగా విప్ రేగా కాంతారావు ఫోటోతో ముద్రించిన మెమొంటోను ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ,నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్న జర్నలిస్టులకు సైతం అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ,రాష్ట్ర కమిటీ జాతీయస్థాయిలో ఎన్నికైన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అక్రిడిటేషన్ మెంబెర్ కర్ర అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు,ఉపాధ్యక్షులు డి రవికుమార్,సంయుక్త కార్యదర్శి సంపత్ రెడ్డి, జాతీయ నాయకులు చిర్ర శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర కమిటీ సభ్యులు కఠారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: