CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో విప్ రేగా సుడిగాలి పర్యటన.సమస్యల పై నేరుగా ప్రజలతో ముఖాముఖీ

Share it:


  • ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని పలు ప్రాంతాలలో ప్రజల ఇబ్బందులును,తెలుసుకునేందుకు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బైక్ పై వెళ్లి,ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని నేనున్నానని భరోసాని కల్పించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ, అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.పలు సమస్యలతో ఇబ్బందులతో ఎదుర్కొంటున్న ప్రజలను ఒక్కొక్కరిని పలకరిస్తూ,వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సమస్యల పై అధికారులతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.నియోజకవర్గాన్ని,ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.అన్ని వీధులలో బైక్ పై తిరుగుతూ, ప్రతి ఒక్కరిని పలకరించారు. వారి సమస్యలు,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.రోడ్లు,డ్రైనేజీ లు,లేని చోట ఉండే కాలనీలకు కొత్త వాటిని మంజూరు చేపించి త్వరలోనే పునః ప్రారంభవిస్తామని స్థానిక ప్రజలకు వారు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు నవీన్,రామి రెడ్డి,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు,యువజన నాయకులు నాయకులు,హర్ష, నాయుడు,సృజన్,పార్టీ కార్యకర్తలు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,పలువురు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: