మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం పెద్దమిడిసిలేరు గ్రామంలో ఉన్న తాలుపేరు ప్రాజెక్టు వరద నీరుతో ఉగ్రరూపం దాల్చింది. ఏడ తేరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడుగా ఎగువ ప్రాంతంలో ఉన్న చతిస్గడ్ రాష్ట్రలో కురుస్తున్నా వర్షాల వలన అడవులలో ఉన్న వాగులు వక్కలు ద్వారా వచ్చిన వరద నీరు వలన ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
దీనికి అప్రమత్తమైన అధికారులు డ్యాం సేఫ్టీ దృశ్య 25 గేట్లలో 24 గేట్లు ఎత్తి 1,82,699 క్యూసెక్కుల నీరుని దిగువకు విడుదల చేశారు.ప్రాజెక్టు లోకు,1,88,870 నీరు చేరుతుంది. ప్రాజెక్టు నీరు నిల్వ యొక్క సామర్థ్యం74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.25 మీటర్ల నీటిని నిల్వ చేసి మిగిలిన నీటిని విడుదల చేయడం జరుగుతుంది.
Post A Comment: