- బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెళ్లి వీరస్వామి,ఏటూరు నాగారం మండల కన్వీర్ ఎంపెళ్లి రాజు డిమాండ్ చేశారు.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
బహుజన సమాజ పార్టీ ఏటూరు నాగారం మండల కన్వీనర్ ఎంపెల్లి రాజు ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని వరద బాధితుల సమస్యలపై తాసిల్దార్ సంజీవ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరు నాగారం మండల కేంద్రంలో వరద ముప్పుకు గురైన కుటుంబాలను బిఎస్పీ ఏటూరు నాగారం మండల కమిటీ,ములుగు అసెంబ్లీ కమిటీ ల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగిందని,ఈ సర్వేలో ఏటూరు నాగారంలోని ముప్పునకు గురైన మాదిగ వాడ 250 కుటుంబాలు, నేతకాని వాడలోని 210 కుటుంబాలు,ముస్లిం వాడలోని 115 కుటుంబాలు,అలాగే 1,2,3,4,11వ వార్డులలో 10 50 కుటుంబాలు,నందమూరి నగర్ లో 160 కుటుంబాలు, తీగల వారిలో 80 కుటుంబాలు,గొల్లవాడ బాణారివాడలో 120 కుటుంబాలు మిగతా చోట్ల కలిపి మొత్తం సుమారుగా 2200 కుటుంబాలు గోదావరి వరద ముప్పుకు గురయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: