మన్యం టీవీ దుమ్ముగూడెం:
మండలంలోని విస్తరణ కురుస్తున్న వర్షాలకు గోదావరి పోటెత్తడం తో పరివాహక ప్రాంత గ్రామాలైన సున్నం బట్టి, ఎస్ కొత్తగూడెం గ్రామ ప్రజలను జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఆధ్వర్యంలో వారితో చర్చించి ముంపుకు గురవుతున్నందున పునరవస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రావాలని కోరారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది ప్రజలను మంగువై బాడవ ఆశ్రమ పాఠశాల పునరావసు కేంద్రం ఏర్పాటు చేశారు. అలానే గంగోలు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కాలనీలో వరద నీరు ఇళ్లల్లోకి రావడంతో ఎంపీటీసీ రత్నాకర్, వీఆర్ఏ గణేష్ వారందరిని గర్ల్స్ ఆశ్రమ పాఠశాల లక్ష్మీ నగరం తరలించారు. అనంతరం మలకపాడు ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావసర కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీ ఓ ముత్యాలరావు, పాఠశాల హెచ్ఎం వీరా కుమారి, సర్పంచు జుంజుూరు లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనికిరాముడు వైద్య సిబ్బంది దుర్గ, ధర్మయ్య వీఆర్ఓ వీఆర్ఏలు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: