మన్యం టీవీ దుమ్ముగూడెం ::
సామాన్య ప్రజలకు భారంగా మారిన జిఎస్టిని తక్షణమే రద్దు చేరని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలిపారు. మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశం పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ప్రజల నడ్డివిరిచి మళ్ళీ ఇప్పుడు జిఎస్టి రూపంలో ప్రజలకు మరింత పెనుభారంగా మారిందని పెంచిన జీఎస్టీని తక్షణమే రద్దుచేయాలి అని పాల ఉత్పత్తులు రైతులపై నిత్యావసరాలను పేదలపై పెనుభారం మోపిన నిరంకుసపాలన సాగిస్తున్న కేంద్రం ప్రభుత్వ పై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని తక్షణమే నిత్యవసరాలపై పెంచిన జిఎస్టి భారాన్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.. ఈకార్యక్రంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ,పార్టీమండలకార్యదర్శికణితి రాముడు, పార్టీఅధికారప్రతినిది జానిపాశ, ఎంపీటీసీ సోడి తిరుపతిరావు, సర్పంచ్ తెల్లం రామకృష్ణ, పార్టీ రైతు విభాగం కార్యదర్శి వాగే వెంకటేశ్వర్లు, ప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మోతుకురి శ్రీకాంత్, యూత్ కమిటి కార్యదర్శి అల్లాడి వెంకటేష్, తదితరులుపాల్గొన్నారు..
Post A Comment: