మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను నియోజకవర్గ వ్యాప్తంగా, వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పై కలిసేందుకు వచ్చిన ప్రజలకు అందుబాటు లో ఉంటూ,వారి సమస్యలను తెలుసుకుంటూ,సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి,సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటానని,సమస్యలపై సానుకూలంగా స్పందించి, పరిష్కరిస్తున్న జన నేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను,అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండేలా కృషి చేస్తానని విప్ రేగా తెలిపారు.
Post A Comment: