గుండాల జూలై 13(మన్యం మనుగడ) నాడు బురదమయం నేడు సిసి రోడ్డు వేయడంతో ప్రజల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. మండల కేంద్రంలో ఎన్నో ఏండ్లుగా మోకాళ్ళ లోతు బురదలో ఉన్న బజార్ నేడు సిసి రహదారిగా మారిపోయింది. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మార్చి నెలలో గుండాల పంచాయతీలు 14 రోడ్లను మంజూరు చేయించారు అందులో ఈ రహదారి కూడా మంజూరై సీసీ రోడ్డు వేయబడినది ఎన్నో ఏళ్లుగా ఈ బజారు వాసులు వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళ లోతు బురదలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది రేగా కృషితో సిసి రోడ్డు వేయడంతో బజారు వాసుల కష్టాలు తొలగిపోయాయి నెరవేర్చిన రేఖ కాంతారావు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Post A Comment: