మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గోదావరి ముంపుకు గురై కట్టు బట్టలు లేకుండా సర్వం కోల్పోయి సి సి రోడ్డు మీద గుడిసెలు వేసి ఉన్నటువంటి పర్ణశాల పంచాయతీ ఎల్ ఎన్ రావుపేట, సీతానగరం, నడిగడ్డ, ఈ గ్రామాల్లో సుమారు 60 కుటుంబాలకు దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాలు, బ్రెడ్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ చేతుల మీదుగా బాధితులకి అందజేశారు. వారు మాట్లాడుతూ వరద బాధితులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సహకారాలు అందిస్తామని ఎవరు కూడా మనోధర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం ఇచ్చే సహాయానికి పేర్లు నమోదు చేసుకోవాలని వారికి భరోసా ఇచ్చారు. బాధితులు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఎస్సై కేశవరావు, స్థానిక సర్పంచ్ వరలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: