మన్యం టీవీ భుర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, గోదావరి ముంపునకు గురైయ్యే బూర్గంపహాడ్,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం,సారపాక పరిసర ప్రాంతాల్లో బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, భద్రాచలం ఏ ఎస్పీ రోహిత్ రాజు,బూర్గంపహాడ్,తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి,స్థానిక ఎస్ఐ జీవన్ రాజు పర్యటించారు. అనంతరం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాగులు,వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి కావున, ఎవరు అటువైపుగా వెళ్లవద్దని, అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ యువజన అధ్యక్షులు గోనెల నాని,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు,ఆర్ ఐ లు శంకర్,అక్బర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: