దమ్మపేట జులై 23 ( మన్యం మనుగడ ) : వరద ఉదృతికి కట్టుబట్టలతో తమ ఇంటిని ఆస్తులను వదిలిపెట్టి కొండప్రాంతలలో తలదాచుకుంటున్న గిరిజన బిడ్డల ఆకలి బాధలను కొంతైనా తీర్చాలి అని అన్న పవన్ కల్యాణ్ గారి ఆదేశాలతో తమ వంతు సాయంగా విరాళాల సేకరణ షేక్ అబ్దుల్ రహీమ్ ఆధ్వర్యంలోని జనసేన మండల కమిటీ అనుకున్నదే తడవుగా గ్రామంలోని నిస్వార్థ సేవకులుగా ఉంటు తమ వ్యాపార కార్యలాపాలను చుస్కుంటునే ఆపద అన్న ప్రతిసారి చెయ్యందించే గ్రామ వ్యాపారస్తులు రాజకీయ నాయకుల సహకారం కోరటం తో వారు అధించిన సహకరంతో
గోదావరి ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు మండలం రేపాకకొమ్ము పంచాయతీలోని మడ్డిగట్ల గ్రామంలోని ఇండ్లు పూర్తిస్థాయి గోదావరి వరద ముంపుకు గురైనందున గ్రామంలోని 240కుటుంబాలకు నిత్యఅవసర సరుకులు మంచినూనే బియ్యం వాటర్ బాటిల్.సబ్బులు.కూరగాయలు అందించారు.
మండల అధ్యక్షులు రహీమ్ మాట్లాడుతూ పేద వాడి ఆకలి కొంతైనా తీర్చాలి వారికి అండగా నిలవాలి అనే ఆశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమనికి సహకరించిన పలువురు గ్రామ పెద్దలకు.తోటి వ్యాపారస్తులకు మరియు పార్టీలకు అతీతంగా స్పందించిన నాయకులకు ప్రతి దాతకు ముఖ్యంగా తన స్నేహితులకు జనసేన పార్టీ మండల కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దమ్మపేట మండల ఉపాధ్యక్షులు వాటి వెంకటరావు.జంగాల చంద్రశేఖర్.సహాయ కార్యదర్శి రేళ్ళ సతీష్. పార్టీ సీనియర్ నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు.కార్యదర్శి పోతురాజు మహేష్.కార్యకర్తలు చలపతి.రషీద్.పలువురు కార్యకర్తలు పవన్ కల్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: