మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని బండారుగూడెం గ్రామంలో సమ్మక సారక్క గద్దెల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి బండారుగూడెం గ్రామానికి చెందిన కాక కిరణ్ (24) తన మోటార్ సైకిల్ TS28C1039 తమ బంధువు అయినా వర్స వెంకటేష్ తో కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో బయటికి వెళ్లారు తూరుబాక గ్రామంలో చెన్నంపేట గ్రామానికి చెందిన పోడియం శేఖర్ అనే స్నేహితుని కూడా మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని ముగ్గురు కలిసి వస్తూ ఆర్ అండ్ బి రోడ్డు బండారుగూడెం గ్రామం దగ్గరికి రాగానే రాత్రి తొమ్మిది గంటల సమయంలో అతివేగంగా నిర్లక్ష్యంగా బైకు నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక నేరుగా మట్టి రోడ్డు పక్కన ఉన్న సమ్మక-సారక్క గద్దెలను గుద్దగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే ముగ్గురిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా కిరణ్ మృతి చెందారని తెలిపారు ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వైద్యం జరుగుతుందని కేవలం అతి వేగం ఆజాగ్రత్త వల్లనే తమకు తాముగా ప్రమాదానికి గురై చనిపోయారని తండ్రి కాక భద్రయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Post A Comment: