మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 01 నుండి 05 తరగతి వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు జెడ్పీఎస్ఎస్ దుమ్ముగూడెం పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా 60 మంది ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు జరుగుతాయి మొత్తం మూడు విడతల్లో మండలంలోని అన్ని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కొనసాగిస్తారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ వారి సామర్థ్యాలు అభ్యర్థుల ఫలితాలు సాధించుటకు పిల్లల సామర్థ్యం చురుకుతనాలు పెంపొదించే విధంగా శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ప్రధానోపాధ్యాయులు ఆపక శంకర్, రిసోర్స్ పర్సన్ ప్రభాకర్ , శ్రీనివాస్, మధుబాబు, అరుణకుమారి, రత్నాకర్, 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: