మన్యం టీవీ చర్ల:
చర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గోదావరి ముంపు గ్రామం దండు పేట గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటి,ఇంటికి తిరిగి మందులు పంపిణీ చేసి, వర్షాకాల సీజన్లో వచ్చే రోగాల పట్ల తగు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడం జరిగింది. వర్షాకాలంలో పరిశుభ్రం పాటిస్తూ, వేడిగా ఉండే ఆహారం మాత్రమే తీసుకుంటూ, కాచి చల్లార్చిన నీరును త్రాగునీరుగా తీసుకోవాలని తగు సూచనలు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చర్ల ఆరోగ్య కేంద్ర బృందం పాల్గొనడం జరిగింది.
Post A Comment: